Andhrapradesh, జూన్ 20 -- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామన్నారు. గోదావరిలోని నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుతున్నాయని. పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులే అని వ్యాఖ్యానించారు.

"విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. గోదావరి ప్రవాహంలో చిట్టచివరి రాష్ట్రంగా వచ్చిన నీటిని మరో బేసిన్ కు తరలిస్తున్నాం. గతంలో కృష్ణా బ్యారేజ్ పై ఇరు రాష్ట్రాల సిబ్బంది గొడవపడ్డారు. గవర్నర్ వద్ద కూర్చొని గతంలో సమస్య పరిష్కరించుకున్నాం. కృష్ణా లో తక్కువ ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను అలాగే కొనసాగిద్దాం. కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి" అని చంద్రబాబు తెలిపారు. ...