Hyderabad,telangana, మే 24 -- తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా ఏపీ ప్రభుత్వం జలదోపిడికి సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆరోపించారు. గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఏపీలో తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతులు లేవని హరీశ్ రావ్ చెప్పారు. రూ. 80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు, మిగతా 50 శాతం ఎఫ్ఆర్బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయం, అనైతికమన్నారు. విభజన చట్టం ప్రకారం. కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమని గుర్తు చేశారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని హరీెశ్ రావు ఆగ్రహం ...