భారతదేశం, మే 27 -- ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు, తల్లికి వందనం పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పాఠశాలలు ప్రారంభానికి ముందే తల్లికి వందనం చెల్లిస్తామని ప్రకటించారు.

కడప మహానాడు స్వాగతోపన్యాసంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి వ్యవహారాల్లో ఎవరిని విడిచి పెట్టేది లేదని, అవినీతి వ్యవహారాల్లో అందరి లెక్కలు తేలుస్తామన్నారు. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నారు.

ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం చెల్లిస్తామని ప్రకటించారు.

త్వరలోనే రైతులకు అన్నదాత నిధుల్ని చెల్లిస్తామని చెప్పారు. ప్రతి రైతుకు రూ.20వేల రుపాయలు చెల్లిస్తామనే హామీకి కట్టుబడి ఉన్...