భారతదేశం, మే 4 -- కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో.. 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడిందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం.. పాలనా వైఫల్యానికి నిదర్శనం అని విమర్శించారు.

'సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీసెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను.. కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగాని తనమే. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్ష...