భారతదేశం, మే 3 -- లక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఏప్రిల్ మరోసారి కొన్ని కంపెనీలకు షాకింగ్ ఫలితాలతో ప్రారంభమైంది. వాస్తవానికి, మార్చి 2025లో బజాజ్ ఆటో అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి నంబర్ -1 స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు అంటే 2025 ఏప్రిల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో టీవీఎస్ మోటార్ నెం.1 కిరీటాన్ని దక్కించుకోగలిగింది.

ఓలా ఎలక్ట్రిక్‌కు కూడా కొంత ఊరట కలిగించే వార్త వచ్చింది. కంపెనీ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. టీవీఎస్ ఏప్రిల్లో 19,736 యూనిట్ల అమ్మకాలతో నంబర్ 1 గా ఉంది. అయితే ఏ కంపెనీ కూడా 20,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటలేకపోయింది.

ఏప్రిల్ 2025లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల గురించి చూస్తే.. టీవీఎస్ మోటార్ కంపెనీ 19,736 యూనిట్లు, ఓలా ఎలక్ట్రిక్ 19,709 యూనిట్లు, బజాజ్ ఆటో 19,001 యూనిట్లు, ఏథర్ ఎన...