భారతదేశం, డిసెంబర్ 19 -- బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత, అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైమెన్సింగ్లో ఒక హిందూ వ్యక్తిని మూకదాడి (Lynching) చేసి చంపడం సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనపై చీఫ్ అడ్వయిజర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. "ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము" అని ప్రభుత్వం హెచ్చరించింది.
యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఫేస్బుక్ వేదికగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "మైమెన్సింగ్లో హిందూ వ్యక్తిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు, విద్వేషాలకు తావు లేదు. ప్రజలు రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు. ఆస్తుల విధ్వంసం, ప్రాణనష్టం కలిగించే ఏ చర్యను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.