Hyderabad, మే 16 -- సమోసా అనగానే బంగాళాదుంపలు, ఉల్లిపాయలతో నిండి ఉంటుంది. అవి లేకుండా సమోసా పూర్తి కాదనుకుంటారు. ఈ రెండూ అవసరం లేకుండా పనీర్, పచ్చి బఠానీలతో వండే ఈ సమోసా చాలా రుచిగా ఉంటుంది. పనీర్ మటర్ సమోసా ఎలా తయారు చేయాలో ఇక్కడ చెప్పాము.

మైదా పిండి - ఒక కప్పు

ఉప్పు -రుచికి సరిపడా

నీళ్లు - సరిపడా

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పచ్చిబఠాణీలు - అర కప్పు

పనీర్ తురుము - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

పచ్చిమిర్చి - రెండు

4. స్టఫింగ్ చేయడానికి బఠానీలను ముందుగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అందులో తురిమిన పనీర్ వేయాలి.

5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి కలపాలి.

6. ఇప్పుడు మైదా పిండి మిశ్రమం నుంచి చిన్న ముద్ద తీసుకోండి. దాన్...