Andhrapradesh, జూన్ 27 -- వాయువ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం(జూన్ 28) రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి...