భారతదేశం, జనవరి 22 -- బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ బిపాసా బసు చాలా కాలం తర్వాత తన కుటుంబంతో కలిసి బయట కనిపించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కుమార్తె దేవితో కలిసి ఒక అరుదైన అవుటింగ్‌లో బిపాసా సందడి చేశారు. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

గురువారం (జనవరి 22) నాడు బాంద్రాలో కారు దిగుతున్న సమయంలో బిపాసాను, తన చిన్నారి దేవిని ఫొటోగ్రాఫర్లు క్లిక్ చేసేందుకు ప్రయత్నించారు. తన కుమార్తె దేవిని ఎత్తుకున్న బిపాసా, వెంటనే అప్రమత్తమై పాప ముఖాన్ని తన చేతులతో కవర్ చేశారు.

కరణ్ సింగ్ గ్రోవర్ బ్యాగ్ తగిలించుకుని వారి వెంటే నడిచారు. ప్యాపరాజీలు (ఫొటోగ్రాఫర్స్) తన కూతురు దేవి ముఖాన్ని ఫొటో తీయడానికి ప్రయత్నిస్తుండటంతో బిపాసా తీవ్ర అసహనానికి గురయ్యారు. బిల్డింగ్‌లోకి వెళ్తున్న సమయంలో కోపంగా ఒక ఫొటోగ్రాఫర్‌ వైపు చూ...