భారతదేశం, మే 26 -- విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై సర్వే ప్రారంభించింది. కాలేజీల్లో ఫీజు బకాయిలు చెల్లించిన వారు, చెల్లించని వారు తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ థంబ్ వేయాల్సి ఉంటుంది. ఫీజు చెల్లిస్తే ఆ రసీదులను సచివాలయాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

2023-24 విద్యాసంవత్సరంలో ఒక టర్మ్ ఫీజు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన టర్మ్స్ ఫీజులు విడుదల చేయాల్సి ఉంది. ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. 2023-24 విద్యాసంవత్సరం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది.

విద్యార్థుల బకాయిల సమస్యను పరిష్కరించేందుకు....గ్రామ, వా...