భారతదేశం, మే 25 -- దేశవ్యాప్తంగా కొత్త టోల్​ పాలసీని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా వన్​-టైమ్​ పేమెంట్​ వ్యవస్థను అమలు చేయాలని ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఏడాదికి ఒక్కసారి పేమెంట్​ చేస్తే చాలు, దేశవ్యాప్తంగా ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రయాణించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫలితంగా మాటిమాటికి రీఛార్జ్​ చేసే పని ఉండదని పేర్కొన్నాయి.

ప్రతిపాదిత కొత్త టోల్​ పాలసీ ప్రకారం.. వాహనదారులకు రెండు ఆప్షన్స్​ అందుబాటులో ఉంటాయి. అవి.. యాన్యువల్​ పాస్​, డిస్టెన్స్​- బేస్డ్​ ప్రైజింగ్​.

యాన్యువల్​ పాస్​ ప్రకారం.. ఫాస్టాగ్​ని ఏడాదికి ఒకసారి రూ. 3వేలతో రీఛార్జ్​ చేయించాలి. తద్వారా జాతీయ రహదారి, రాష్ట్ర ఎక్స్​ప్రెస్​వేలు, ఎక్స్​ప్రెస్​వేలపై ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రయా...