భారతదేశం, జూన్ 7 -- హరిహర వీరమల్లు రిలీజ్ కోసం ఎంతో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. జూన్ 12న రిలీజ్ కావాల్సిన మూవీ మరోసారి వాయిదా పడింది. థియేట్రికల్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయినా ఈ మూవీ గురించి క్రేజీ బజ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసేలా హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై పవన్ మండిపడ్డారు. ఆ సందర్భంగా 'సీజ్ ద షిప్' అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫేమస్ గా మారిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లులోనూ 'సీజ్ ద షిప్' అనే మాటను రీ క్రియేట్ చేసినట్లు యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని జ్యోతికృష్ణ‌ తెలి...