భారతదేశం, మే 8 -- దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సెలబ్రిటీల్లో బాలీవుడ్ స్టార్లు ఉంటారు. టాప్ స్టార్స్ సాధారణంగా ప్రతి పబ్లిక్ అప్పియరెన్స్ కోసం, షోలు, మూవీస్ కోసం రూ.కోట్లు తీసుకుంటారు. ఇండియన్ సినిమాలోని టాప్ స్టార్స్ చాలా మంది లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. చాలా మందికి ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఓ ప్రైవేట్ ఐలాండ్ కలిగి ఉన్నది మాత్రం కేవలం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రమే.

శ్రీలంక కు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెండు దశాబ్దాలుగా పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకోణ్, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం లేని విధంగా జాక్వెలిన్ ఓ ప్రైవేట్ ద్వీపం సొంతం చేసుకున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కలిగి ఉన్న ఏకైక బాలీవుడ్ నటి. దీని కోసం 2012లో ఈ...