Pithapuram,andhrapradesh, జూన్ 8 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు రక్షణ కల్పించేలా సేఫ్టీ కిట్స్ అందజేశారు. ఇందుకోసం ఇవాళ మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న 325 మంది ఎలక్ట్రీషియన్లకు సెఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు.పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించారు.

ఇటీవల పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో మృతి చెందారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. భవిష్యత్తులో మరొకరి ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గత ఏప్ర...