భారతదేశం, మే 26 -- విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ ను నాలుగో రోజు ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఎన్ఐఏ విచారణలో నిందితులు కీలక సమాచారం బయటపెట్టారు. ఉగ్రదాడికి విజయనగరమే తన మొదటి టార్గెట్ అని సిరాజ్ చెప్పినట్లు సమాచారం.

అయితే హైదరాబాద్ లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండర్ల నుంచి సమాచారం వచ్చిందన్నారు. కానీ ప్రశాంతంగా ఉండే విజయనగరమే తన లక్ష్యమని వాళ్లకు చెప్పానని సిరాజ్ ఎన్ఐఏ విచారణలో వెల్లడించాడు. పేలుళ్ల కోసం సౌదీ, పాకిస్తాన్ లో శిక్షణ తీసుకున్నట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది.

బాంబ్ పేలుళ్ల కోసం విజయనగరంలోని నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమీర్ చెప్పినట్లు సమాచారం.

గత విచారణలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్ల కోసం సిరాజ్‌, సమీర్‌ హైదరాబాద్‌, విజయనగరం, దిల్లీ, బెంగళూరు, ముంబయిలో రెక్కీ చేశారు. విశాఖకు చ...