Hyderabad,telangana, మే 2 -- హైదరాబాద్ నగర పరిధిలోని జనరల్ బస్ పాస్ వినియోదారులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రూ.20 కాంబినేషన్ టికెట్ తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్ పాస్ కలిగిన వారు ఈ కాంబినేషన్ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

మరోవైపు తెలంగాణలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాటపట్టనున్నాయి. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, లేబర్‌ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు.

మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చా...