Andhrapradesh,telangana, మే 31 -- వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. రైల్వే ప్రయాణాల సంఖ్య పెరగటంతో స్టేషన్లలో రద్దీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్‌ రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

విశాఖ - బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుంది . మరోవైపు బెంగళూరు - విశాఖ మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుంది.

విశాఖ -తిరుపతి రైలు జూన్‌ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఇక ప్రతి...