భారతదేశం, డిసెంబర్ 25 -- పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వృత్తిలో ఉండి దారుణమైన ఘటనకు తెగబడ్డారు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. తనది ప్రభుత్వ ఉద్యోగం, ప్రియుడిది ప్రభుత్వ ఉద్యోగం.. భర్తను చంపేస్తే ఇద్దరం హాయిగా ఉండొచ్చని అనుకుంది ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. జనాలను నమ్మించేందుకు చేయాల్సిన నాటకం అంతా చేసింది. కానీ అసలు విషయం బయటకు వచ్చి.. ప్రియుడితో కలిసి ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో భార్యాభర్తలు లక్ష్మణ్ నాయక్(38), పద్మ(30) నివాసం ఉంటున్నారు. 2024లో డీఎస్సీలో ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది పద్మ. ఈ క్రమంలో పద్మకు, తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న రాత్లావత్ గోపి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఏర...