భారతదేశం, మే 16 -- ప్రభుత్వ ఉద్యోగం కావాలని చాలా మంది కలలు కంటారు. ఇందుకోసం ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) అందించింది. ఇందులో ఖాళీగా ఉన్న 147 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామక ప్రక్రియ మే 9, 2025 నుండి మెుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 24, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నియామకాలకు దరఖాస్తులు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే స్వీకరిస్తారని గుర్తుంచుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో లేదా మరే ఇతర పద్ధతి ద్వారా పంపిన ఫారమ్‌లు చెల్లవు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ (కాటన్ టెస్టింగ్ ల్యాబ్), మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్...