భారతదేశం, మే 19 -- ప్రపంచం నలుమూలల నుంచి శరణార్థులు వచ్చి స్థిరపడే ధర్మశాల భారత్ కాదని సుప్రీం కోర్టు కామెంట్స్ చేసింది. శ్రీలంక తమిళుడు దాఖలు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మన జనాభా 140 కోట్లకు పైగా ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ సందర్భంగా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం నలుమూలల నుంచి శరణార్థులను భారత్ ఆహ్వానించగలదా? ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారికి స్వాగతం పలికే ధర్మశాల కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

నిషేధిత ఎల్టీటీఈతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పిటిషనర్‌ను 2015లో అరెస్టు చేశారు. 2018లో ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై ఆయన హైకోర్టులో అప్పీల్ చేయగా శిక్షను ఏడేళ్లకు కుదించారు. శిక్ష పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కూడా హైకోర్టు ఆదేశిం...