Andhrapradesh,amaravati, మే 8 -- రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత-నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తలపెట్టిన అన్ని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ప్రతీ రహదారి పనులకు డెడ్‌లైన్ నిర్దేశించి, అనుకున్న సమయానికల్లా కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షాకాల రాకముందే రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. 8,744 కి.మీ వరకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులు జాతీయ స్థాయిలోనే నెంబర్‌వన్‌గా ఉండాలని సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో పూర్తిగా పాడైన 2,683 కి.మీ. రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.

గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు. ఆర్ అండ్ బీలో ఉన్న 304 ఏఈ పోస్టుల ఖాళీల్లో గ్...