భారతదేశం, ఫిబ్రవరి 9 -- భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పేదల సంక్షేమం, భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సొంత ఇల్లు అనే కలను నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

'వందకు వంద శాతం పట్టణాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకుంది.' అని మంత్రి పొంగులేటి అన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని పొంగులేటి చ...