భారతదేశం, మే 3 -- మద్యం సరఫరా, డిస్టిలరీలపై రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు.. ఆ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరికిచ్చారు.. ప్రధాన సూత్రధారి ఎవరంటూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ్టి నుంచి కేసులో ఏ8గా ఉన్న చాణక్యను కూడా ప్రశ్నించనున్నారు. ముందు విడివిడిగా.. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది.

రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు సిట్‌ కస్టడీకి ఇవ్వటంతో.. తొలి రోజు 7 గంటల పాటు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ప్రశ్నించారు. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా వివరాలు రాబట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలిచ్చినా.. తమ వద్దనున్న ఆధారాలు, కాల్‌డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు చూపించి ప్రశ్నించారు.

తొలి రోజు విచారణకు రాజ్‌...