Telangana,hyderabad, మే 24 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్లే కాదు.... పాటు మీసేవా ద్వారా కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు.... అర్హతలు కలిగి ఉంటే అఫ్రూవ్ చేస్తున్నారు. వీరికి మాత్రమే కొత్త కార్డులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు మంజూరు కాగా... మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ కూడా చేస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదే సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలు కూడా చేసింది. దీంతో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తెల్ల కాగితంపై రాసి గ్రామ...