Telangana,hyderabad, మే 21 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు వస్తుండగా... మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే చాలా మంది కొత్త కార్డుల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా కూడా ఆఫ్ లైన్ ద్వారా సాగింది. అయితే దరఖాస్తుదారులు వారి స్టేటస్ వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత మీసేవా ద్వారా అవకాశం కల్పించింది. మీసేవాలో అప్లికేషన్ చేసుకున్న వారికి అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీనితో సులభంగా వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు. కానీ ప్రజాపాలన(ఆఫ్ లైన్)లో దరఖాస్తులు చే...