భారతదేశం, జూన్ 2 -- ఆంధ్రప్రదేశ్‌ లో రేషన్‌ దుకాణాలను పునః ప్రారంభించడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు తిరిగి నూతన జవసత్వాలు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్‌ దుకాణాలు ఇప్పుడు నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా మొదలైంది. రేషన్‌ దుకాణాలు పునః ప్రారంభించడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం కేవలం ప్రజలకు సంతోషం కలిగించడమే కాకుండా, గత ప్రభుత్వం చేసిన అనవసర వ్యయాన్ని తగ్గించగలిగింది.

ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ, పీపుల్స్‌ పల్స్‌ కొన్ని నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థపై నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ప్రజలు ''మాకు రేషన్‌ షాపులే మేలు, మళ్లీ పాత విధానాన్...