భారతదేశం, మే 6 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేయడం విచారకరమని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కుటుంబం అంటూనే ఉద్యోగులను బజారున పడేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాయి. టీఎస్‌టీయూఎఫ్, టీఆర్‌టీఎఫ్, ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వేర్వేరు ప్రకటనల్లో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలను ఖండించాయి.

'అక్టోబర్ 24న జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం సమస్యలన్నీ విన్నారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. ఆరు నెలలు గడుస్తున్నా ఉపసంఘం సమావేశమే జరగలేదు. రాజ్యాంగబద్ధంగా పొందాల్సిన ప్రాథమిక హక్కును ఉద్యోగులు అదనంగా, అనవసరంగా అడుగుతున్నారన్నట్టుగా సీఎం వ్యాఖ్యలున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, దాచుకున్...