భారతదేశం, మే 5 -- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ యూనియన్ల సమరం తెలంగాణ ప్రజలపైనా? గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? సమ్మె అంటూ ప్రశ్నించారు.

"ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ఇస్తున్నాం. గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కేవలం పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ. 30 వేల కోట్ల నగదును బదిలీ చేసింది. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లింది గత ప్రభుత్వం"- సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం ఆర్థిక ఇబ...