భారతదేశం, మే 4 -- ప్రకాశం జిలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు మండలం కొప్పోలు వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. గుడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అయితే బోల్తా పడిన లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో అగి ఉన్న కారును వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా... పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....