భారతదేశం, మే 23 -- ఓటర్ల సౌకర్యాన్ని పెంచడానికి, ఓటింగ్ రోజున ఏర్పాట్లను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల మొబైల్ ఫోన్‌లను పోలింగ్ కేంద్రాల వెలుపల డిపాజిట్ చేసే సౌకర్యాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద మెుబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లు తమ ఫోన్లను డిపాజిట్ చేసే సదుపాయం లేకపోవడంతో దుస్తుల్లో దాచి పోలింగ్ బూత్ ల్లోకి తీసుకెళ్తున్నారు. వీడియోలు, ఫొటోలు తీస్తున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఓటర్లకు ఉపశమనం కలిగిస్తూ పోలింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయడానికి కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

అంతేకాకుండా ఓటింగ్ నిర్వహణను మరింత హేతుబద్ధంగా చేయడానికి కమిషన్ మరొక చొరవ ...