భారతదేశం, మే 29 -- ముంబై: పొరుగు వ్యక్తిని కుక్క కరిచిన ఏడేళ్ల నాటి కేసులో ముంబైలోని దాదర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో వర్లీకి చెందిన 40 ఏళ్ల రిషబ్ పటేల్‌కు నాలుగు నెలల జైలు శిక్ష, Rs.4,000 జరిమానా విధించింది. 2018 ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటనపై మే 21, 2025న కోర్టు తీర్పు వెలువరించింది.

బాధితుడు రమిక్ షా తన కొడుకు, పనిమనిషితో కలిసి నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కిందకు వస్తున్నారు. మూడో అంతస్తులో రిషబ్ పటేల్ తన కుక్కతో లిఫ్ట్ ఎక్కాడు. తన కొడుకుకు కుక్కలంటే భయమని, కుక్కను బయట ఉంచమని లేదా తాము లిఫ్ట్ దిగిపోతామని షా పటేల్‌ను కోరాడు. అయితే, పటేల్ తన కుక్కను లిఫ్ట్‌లోకి లాగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుక్క షా ఎడమ చేతిని కరిచింది. చికిత్స అనంతరం షా వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వర్లీ...