Andhrapradesh, మే 28 -- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సీఎం చంద్రబాబే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడని. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందంటూ సెటైర్లు విసిరారు.

"తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికే ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు. డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో పడిపోతాడు" అని వైెఎస్ జగన్ దుయ్యబట్టారు.

కూటమి పాలనలో రెడ్‌బుక్‌ రాజ్...