Hyderabad, జూన్ 10 -- పూరీలో రథయాత్ర చేస్తారన్న విషయం మనకు తెలుసు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో పూరీ జగన్నాథుని భక్తులు రథయాత్రకు పెద్ద సంఖ్యలో వెళతారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో రథయాత్రను వీక్షిస్తారు. ఈ రథయాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. అయితే, పూరీలో రథయాత్ర జరుగుతుందన్న విషయం మనకు తెలుసు.

కానీ పూరీతో పాటు చాలా చోట్ల రథయాత్రను నిర్వహిస్తారు. మరి పూరిలోనే కాకుండా రథయాత్రను ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుంచి మొదలవుతుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రంలో ఈ రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాడమాసం శుక్లపక్షం రెండవ రోజు నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. కృష్ణ భక్తులు విదేశాల నుంచి కూడా వస్తారు. అయితే, పూరీతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ రథయాత్ర జర...