Hyderabad, మే 27 -- పీరియడ్స్ గురించి చెబితేనే ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలు మౌనంగా ఉండిపోతారు. సిగ్గుతో శానిటరీ న్యాప్‌కిన్లను దాచిపెట్టి తీసుకువెళుతూ ఉంటారు. ప్రపంచంలోని ప్రతి మహిళకు రుతుస్రావం తప్పనిసరి. కానీ దాని గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యం మాత్రం వారికి ఉండదు. తమకున్న సమస్యలను కూడా వారు బయటకు చెప్పుకోలేరు.

పీరియడ్స్ లో సరైన పరిశుభ్రత పాటించక ఎంతో మంది మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆ విషయంలో మహిళల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది 'మెన్‌స్టువల్ హైజీన్ డే' వస్తుంది. అంటే ఋతు పరిశుభ్రత దినోత్సవం.

పదహారేళ్ల లక్ష్మికి పీరియడ్స్ అంటేనే భయం. న్యాప్‌కిన్లు పెట్టుకున్న కాసేపటికి దురద మొదలైపోతుంది. చికాకుగా అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ అలాగే ఉండాలి. పీరియడ్స్ తర్వాత ఇన్ఫెక్షన్లు మొదలైపోతాయ...