Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. పలు సబ్జెక్టుల పరీక్షలు రాసిన విద్యార్థులు. సీపీగెట్ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు వివరాలను వెల్లడించారు.
ఆగస్టు 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు జరిగాయి. ప్రతి రోజూ 3 సెషన్ల్లలో నిర్వహించారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగాయి.
ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.