భారతదేశం, మే 29 -- పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై చర్చించడం సహా భారతదేశంతో చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు స్పష్టమైన సమాధానం ఇచ్చింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం మాట్లాడుతూ.. 'పాకిస్థాన్‌తో మా సంబంధాల విషయానికొస్తే, మా వైఖరి పూర్తిగా స్పష్టంగా ఉంది. ఏదైనా సంబంధం ద్వైపాక్షికంగా ఉండాలి. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని పునరుద్ఘాటించాలనుకుంటున్నాం.' అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

'పాకిస్థాన్ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించాల్సి ఉంటుంది. వారి రికార్డులు, జాబితాను మేం కొన్ని సంవత్సరాల క్రితం వారికి అప్పగించాం. ఇది కాకుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పూర్తిగా ఖాళీ చేసినప్...