Hyderabad, మే 26 -- ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు కళ్లజోడు చాలా సాధారణంగా కనిపిస్తుంది. తరగతి గదిలో బ్లాక్ బోర్డు చూడాలన్నా, టీవీ చూడాలన్నా కూడా మసకగా కనిపించడం వల్ల కళ్లజోడు అవసరం అవుతోంది. ఈ విధంగా దూరంగా ఉన్న వస్తువులు సరిగా కనిపించకపోవడాన్ని మయోపియా (నికట దృష్టి లోపం) అంటారు. చాలా మంది పిల్లల్లో ఈ తరహాలో పాలు పళ్లు రాలకముందే కళ్లజోడు అవసరం అవుతుండటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సమయం స్క్రీన్‌లు చూడటం అయినప్పటికీ, చిన్న పిల్లల దృష్టి లోపానికి మరో కారణం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ విషయం గురించి హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, బెంగళూరులోని క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ అమోద్ నాయక్ కీలక విషయాలు వెల్లడించారు. పిల్లల్లో నిద్రలేమితో పెరుగుతున్న సమస్యలను వ...