Hyderabad, ఏప్రిల్ 11 -- మనసు ఎప్పుడూ వద్దు అన్న పనిని చేయడానికి ఆరాటపడుతుంది. ఇది పిల్లల విషయంలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు వద్దు అన్ని పనినే చేయడానికి ప్రయత్నిస్తారు. దొరికిపోయినప్పుడు తప్పును కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలు చెప్తారు. ఉదాహరణకు చాలా మంది చిన్న పిల్లలు మట్టి తింటారు, అమ్మ వచ్చి అడిగితే లేదు నేను తినలేదు అంటారు. ఇది సాధారణ బాల్య ప్రవర్తన కావచ్చు. కానీ ఇలా అబద్ధం చెప్పడం వారికి అలవాటుగా మారితే మాత్రం తల్లిదండ్రులకు తీవ్రమైన సమస్యగా మారుతంది.

పిల్లలలో అబద్దం చెప్పే అలవాటును సకాలంలో గుర్తించి వారిలో మార్పు తీసుకురాకపోతే పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. బాల్యం నుంచే పిల్లల ప్రవర్తన, అలవాట్ల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

చిన్నప్పటి నుండి పిల్లలతో తల్లిదండ్రులు...