Hyderabad, మే 18 -- భారతదేశంలో పిల్లలను దత్తత తీసుకునే ప్రక్రియ అంత సులభం కాదు. ఇది కొంచెం సవాళ్లతో కూడిన విషయమే. మీడియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం 2023 జనవరిలో 2,188 మంది పిల్లలను దత్తత తీసుకోవడానికి 31,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

అంటే మనదేశంలో పిల్లలను దత్తత తీసుకోవడానికి చాలా కాలంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. 2016లో జువెనైల్ చట్టానికి సవరణలు చేసినప్పుడు కోర్టుల్లో సుదీర్ఘ ప్రక్రియకు చెక్ పెట్టేందుకు . దత్తత ఉత్తర్వులు జారీ చేసే అధికారం జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)కు ఇచ్చారు.

హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956 ప్రకారం దత్తత తీసుకోవాలనుకునే వ్యక్తి కచ్చితంగా హిందువు, బౌద్ధ, సిక్కు, జైన మతస్థుడై ఉండాలి. యూదు, పార్శీ, క్రిస్టియన్, ముస్లిం మతస్థులకు దత్తత తీసుకునే హక్కు లేదు. దత్తత తీసుకున్న వ్యక్తికి బిడ్డను దత్తత తీసుకునే ...