భారతదేశం, ఏప్రిల్ 27 -- పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో ఎలాంటి హత్యా కోణం లేదని పోలీసులు తేల్చారు. పోలీసుల దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉండటం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించారని తేలింది. అయితే.. ఈ కేసులో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోర్టులో పిల్ దాఖలు చేశారు.

'పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో రీ-పోస్టుమార్టం కోరుతూ హైకోర్టులో పిల్‌ వేశా. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో నిపుణులు లేదా నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో వైద్యులతో రీ-పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇప్పటికీ పోస్టుమార్టం నివేదిక బయట పెట్టలేదు. ప్రవీణ్‌ది హత్య అని అనుమానం కలుగుతోంది' అని మాజీ ...