భారతదేశం, మే 9 -- పాకిస్థాన్‌ దాడి ప్రయత్నాలను భారత్‌ తిప్పికొడుతోంది. అయితే ఈలోగా ఆ పాక్‌లో కొత్త విపత్తు వచ్చి పడింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ ఇప్పుడు తిరుగుబాటును తీవ్రతరం చేసింది. తిరుగుబాటు సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వారు కూడా స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేసే అవకాశం కోసం చూస్తున్నారు.

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బలూచ్ తిరుగుబాటు సంస్థలకు చెందిన మూడు గ్రూపులు ప్రకటించాయి. ఈ ప్రదేశాల్లో బలూచిస్థాన్ జెండాలను కూడా ఎగురవేశాయి. పాకిస్థాన్ జెండాలను దించి బలూచిస్థాన్ జెండాలను ఎగురవేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గురువారం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రెండు చోట్ల పాక్ సైన్యంపై దాడులు చేసింది. వీటిలో ఒకటి రిమోట్ బాంబు దా...