భారతదేశం, మే 19 -- దాయాది పాకిస్థాన్ ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని భారత్ చూస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది ఇండియా. ఇప్పుడు క్రికెట్లోనూ శత్రు దేశాన్ని ఏకాకి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ డిసిషన్ తీసుకుంది. ఈ చర్యతో పాకిస్థాన్ క్రికెట్ ఒంటరి అయ్యే అవకాశముంది. ఆసియాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి సపోర్ట్ ఉండదు.

భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే అన్ని టోర్నీల నుంచి వైదొలగాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. పాకిస్థాన్ క్రికెట్ ను ఏకాకిని చేయాలని చూస్తోంది.

వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి, భారత్ ఆతిథ్య దేశంగా సెప్టెంబర్లో జరగనున్...