భారతదేశం, మే 3 -- పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల పోస్టల్, పార్శిల్ సర్వీసుల మార్పిడిని తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన, భూ మార్గాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. అన్ని రకాల దిగుమతులను పూర్తిగా నిషేధించడం, భారత ఓడరేవుల్లోకి పాక్ జెండాగల నౌకల ప్రవేశాన్ని నిషేధించడం సహా భారత్ ఇవాళ పాకిస్థా‌న్‌కు వ్యతిరేకంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ నుంచి విమాన, భూ మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్శిళ్ల మార్పిడిని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

నిజానికి భారత్, పాకిస్థా‌న్‌ల మధ్య పోస్టల్ సేవల మార్పిడి చాలా కాలంగా పరిమిత స్థాయిలో కొనసాగుతోంది. ఆర్టికల్ 370 తొలగించిన తరువాత పాకిస్థా‌న్‌ కొంతకాలం పోస్టల్ సేవలను నిలిపివేసింది. మూడు నెలల తరువాత తిరిగి ప్రారంభమైంది. అయితే ప్రస్తుత ఉద్రిక్త ప...