భారతదేశం, మే 17 -- ాకిస్థాన్‌కు టర్కీ మద్దతివ్వడాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్‌కు మద్దతిచ్చే వైఖరిని టర్కీ పునఃపరిశీలించాలని చెప్పారు. భారత్‌తో టర్కీకి చారిత్రక సంబంధాలు ఉన్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవడం, కమ్యూనిటీలను విడదీయడం పాకిస్థాన్ చేస్తున్న పనులు అని మండిపడ్డారు.

భారత్‌తో ఘర్షణలో తనను తాను ఇస్లామిక్ దేశంగా చూపించుకోవడంపై పాకిస్థాన్‌ను నిలదీయాల్సిన అవసరం ఉందని ఓవైసీ అన్నారు. 'భారత్ కథను మనం ముందుకు తీసుకెళ్లాలి. పాకిస్థాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ భారతదేశంలో కూడా దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అని ఓవైసీ చెప్పారు. పాకిస్తాన్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ మంది ముస్లింలు ఉ...