భారతదేశం, మే 16 -- త ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సౌదీ అరేబియా నుంచి 5,033 మంది పాకిస్థానీ యాచకులను బహిష్కరించారు. ఈ విషయాన్ని హోంమంత్రి మోసిన్ నఖ్వీ పాక్ పార్లమెంటులో వెల్లడించారు. సౌదీ అరేబియాతో పాటు మలేషియా, ఇరాక్, యూఏఈ, ఒమన్, ఖతార్ వంటి దేశాలకు కూడా ప్రజలు భిక్షాటన కోసం వెళ్తుంటారని చెప్పారు.

ఇవన్నీ ఇస్లామిక్ దేశాలని, భిక్షాటన ద్వారా ఇక్కడ బతకవచ్చని పాకిస్థాన్‌లోని పేద ప్రజలు భావిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం వేలాది మంది పాకిస్థానీ యాచకులను వెనక్కి పంపుతుంది. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

2024 జనవరి నుంచి ఇప్పటి వరకూ సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యూఏఈ నుంచి మొత్తం 5,402 మంది యాచకులను వెనక్కి పంపినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే 552 మంది పాకిస్థానీ యాచకులను ...