భారతదేశం, మే 10 -- పాకిస్థాన్ కు దారుణ పరాభవం. ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఘోర అవమానం. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను నిర్వహించే అవకాశం లేక వాయిదా వేసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎస్ఎల్ మిగిలిన మ్యాచ్ లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావించింది. కానీ అందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నో చెప్పడంతో పాక్ ఖంగుతింది.

భారత్, పాక్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా పీఎస్ఎల్ 2025ను పీసీబీ నిరవధికంగా వాయిదా వేసింది. మొదట ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించేందుకు పీసీబీ ప్రయత్నించింది. కానీ భారత్ తో సత్సంబంధాల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అందుకు నో చెప్పింది. చివరకు చేసేదేం లేక పీఎస్ఎల్ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసింది....