భారతదేశం, మే 22 -- పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని టాండో జామ్ పట్టణంలో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం ఆక్రమణకు గురైంది. వందేళ్ల నాటి శివాలయం ఉన్న స్థలాన్ని ఆక్రమించారని హిందూ సంఘం ప్రతినిధి ఒకరు గురువారం తెలిపారు. దీంతో పాటు దాని చుట్టూ నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు.

'ఇక్కడ ఆలయం ఒక శతాబ్దానికి పైగా పురాతనమైనది, కానీ కొందరు దీనిని స్వాధీనం చేసుకుని ఆలయం చుట్టూ ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలను ప్రారంభించారు.'అని అని పాకిస్థాన్‌లోని హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దర్వార్ ఇత్తెహాద్ పాకిస్థాన్ సంస్థ అధిపతి శివ్ కచ్చి చెప్పారు. అదే సమయంలో శివాలయానికి వెళ్లే మార్గాన్ని, ప్రవేశాన్ని అడ్డుకున్నారన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. శివాలయం నిర్వహణ, ఆలయం చుట్టుపక్కల సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని పర...