భారతదేశం, మే 7 -- పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​- పాకిస్థాన్​ మధ్య నెలకొన్ని ఉద్రిక్తత బుధవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్​ సిందూర్​ పేరుతో భారత్​ పాక్​తో పాటు పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి తాజా పరిస్థితులకు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​ ఎలా స్పందిస్తుంది? ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​ ఎలా ఉండబోతోంది? నిపుణుల మాటలను ఇక్కడ తెలుసుకోండి..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 156 పాయింట్లు పెరిగి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 24,380 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 648 పాయింట్లు పడి 54,271 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐ...