భారతదేశం, మే 7 -- Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్, పిఓకేలలోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు.

ఈ వైమానిక దాడిలో దాదాపు 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. బుధవారం ఉదయం ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇవ్వడానికి భారత సైన్యం తమ ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులను ముందుకు తెచ్చింది. వారిలో ఒకరు వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి.

ఇద్దరూ కలిసి పాకిస్తాన్ గుట్టును రట్టు చేశారు. సైన్యం దాడులు చేసి పాక్‌లో నడుస్తున్న ఉగ్రవాద కర్మాగారాలను ఎలా నాశనం చేసిందో వివరించారు. సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. వ్యోమికా సింగ్ భారత వైమాని...