Hyderabad, మే 27 -- పవన్ కల్యాణ్ కామెంట్స్ తో దిల్ రాజు ఏకీభవించాడు. సగటు సినిమా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన సలహాలను అతడు స్వాగతించాడు. ఈ మేరకు అతడు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అందులో కొన్ని కీలకమైన అంశాలపై స్పందించాడు.

సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి రప్పించడానికి పవన్ చేసిన సూచనల్లో ఒకటి థియేటర్లో తినుబండారాలు, పానీయాల ధరలను తగ్గించడం. ఈ సలహాతో దిల్ రాజు కూడా ఏకీభవించాడు. ఈ ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ నిర్ణయం అభినందనీయం అని అన్నాడు. దీనిని స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు.

ఇక ప్రేక్షకుల థియేటర్లకు రావడం తగ్గిపోవడానికి మరో ప్రధాన కారణం.. కొత్త మూవీస్ చాలా త్వరగానే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం. దీంతో దీనిపైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన...